Author: mainjournal

Distributed grain sticks for birds and donated sewing machine on 1-Jan-2025

1-1-25 బుధవారం ఉదయం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఆంగ్ల నూతన సంవత్సర మహాసభ సందర్భంగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఒక నిరుపేద మహిళకు ఒక కుట్టు మిషన్ బహుకరించారు. డా. ఉమా లతాశ్రీ ఈ కార్యక్రమానికి సహకరించారు. పక్షులకు ఆహారం కొరకు ధాన్యపు కుచ్చులను స్వామి వారి సోదరుడు అహ్మద్ ఆలీషాగారికి మరియు 13 మంది వివిధ విభాగాల్లో సేవలు అందించిన వాలంటీర్లకు అందచేశారు.

UARDT has donated sewing machines

15-Nov-2024: కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం పిఠాపురం పీఠం ప్రధాన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో సద్గురువర్యులు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున నిరుపేదలకు కుట్టుమిషన్లు, పక్షుల ఆహారం కొరకు ధాన్యపు కుచ్చులను పీఠాధిపతి పంపిణీ చేసారు.

Social and environmental services on 9-Sep-2024

ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పీఠాధిపతి ఉమర్ ఆలీషా స్వామివారు ప్రారంభించారు. ట్రస్ట్ ద్వారా ఎంతోమంది నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు, పక్షుల ఆహారం కొరకు తయారుచేసిన ధాన్యపు కుచ్చులను సభలో పంపిణీ చేసారు. #uardt #uardt2000 #umaralisha #umaralisharuraldevelopmenttrust #Pithapuram #svvvap1472

World Environment Day Celebrations 2024

ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు జూన్ 5, 2024 : ఏ.ఎస్.ర్ హెూమియోపతి మెడికల్ కాలేజ్, తాడేపల్లిగూడెం మరియు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం వారి సంయుక్త ఆధ్వర్యములో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, తాడేపల్లిగూడెం రిజిస్ట్రార్ డా. బి. శ్రీనివాసులు, పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమమును ప్రారాంభించారు. ఈ కార్యక్రమములో సుమారు వందకు పైగా ఓషధ మొక్కలు, పళ్ల మొక్కలు, […]

Back To Top