ది. 12 సెప్టెంబర్ 2020 శనివారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమం నిర్వహించబడినది

ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చీరల పంపిణీ

శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సభ్యులు సహాయ ఖజానా అధికారి గారపాటి గోపాలరావు గారి కుమారుడు గారపాటి శ్రీ గణేష్ సత్య కిషోర్ గారి పుట్టిన రోజు (ది.12/09/2020) సందర్భంగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరుపున “నా మొక్క నా శ్వాస” ద్వారా మొక్కల పంపిణీ మరియు పేద ప్రజలకు చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గోపాలరావు గారు మాట్లాడుతూ మానవ సేవయే మాధవసేవ అని లేనివారికి చీరల పంపిణీ, నా మొక్క నా శ్వాస అనే నినాదంతో మొక్కల పంపిణీ గత నాలుగు సంవత్సరాలు గా పంపిణీ చేయడం జరుగుచున్నది. ఈ కార్యక్రమంలో గారపాటి గోపాలరావు గారి కుటుంబ సభ్యులు మరియు పీఠం సభ్యులు పాల్గొన్నారు.

Back To Top