మొక్కలు నాటుట ద్వారా మాత్రమే భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ ఉచితంగా లభిస్తుందని లేదంటే నిత్యావసరాల వలె ఆక్సిజన్ కూడా కొనుగోలు చేయ వలసిన అవసరం ఏర్పడుతుంది అని Peethadipathi Dr Umar Alisha అనుగ్రహ భాషణ చేశారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం రోజున గురువారం ఉదయం పిఠాపురం లో స్థానిక Dr Umar Alisha స్వామి వారి గృహం వద్ద ఉన్న డివైడర్ లో Peethadipathi Dr Umar Alisha మొక్కలు నాటిన అనంతరం పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ర్యాలీ కి జెండాను ఊపి,ప్రతీ ఒక్కరూ సంవత్సరం లో 3 మొక్కలు నాటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరునిగా,నామకరణం చేసి, వాటిని పెంచి పెద్ద చేసి, వాటి ఫలాలు, పువ్వులు భగవంతుడు సన్నిధానం లో ఉంచి, భగవంతుని ఆశీస్సులు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం janasena ఇన్చార్జ్ శ్రీ Marreddy శ్రీనివాస్ గారు, మున్సిపల్ కమిషనర్ శ్రీ కనకారావు గారు, Eastern Delta గోదావరి చైర్మన్ శ్రీ మురాలశెట్టి సునీల్ కుమార్, janasena టౌన్ ప్రెసిడెంట్ శ్రీ చెల్లు బోయిన సతీష్ కుమార్, BJP జిల్లా జనరల్ secretary శ్రీ కండి కొండలరావు, BJP టౌన్ సెక్రటరి శ్రీ వానపల్లి రమణ, BJP Vice President శ్రీ లింగంపల్లి రవీంద్ర బాబు, BJP జిల్లా intellectual Convenor Sri AV మోహన్ రావు, BJP మెంబర్ శ్రీ కమ్ముల వెంకట రమణ మూర్తి, శ్రీమతి యేలిశెట్టి వెంకట కమల, శ్రీ తోట యేడు కొండలు, శ్రీ బొజ్జ లోవ రాజు, Umar Alisha Rural development కమిటీ సభ్యులు శ్రీ PERURI SURIBABU, శ్రీ AVV Satyanarayana, Sri NTV ప్రసాద వర్మ, Sri రేఖా ప్రకాష్, Pithapuram UARDT కమిటీ సభ్యులు శ్రీ RK శివ రామ కృష్ణన్, సానబోయిన కృష్ణ కుమార్, కార్పొరేటర్ శ్రీ అల్లవరపు Nagesh మరియు వందలాది ట్రస్ట్ కార్యకర్తలు, సభ్యులు మరియు RRBHR కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ Ambekar సెంటర్ నుండి పిఠాపురం పుర వీధుల గుండా సినిమా హాలు వద్ద గల పార్క్ వరకు సాగింది. ప్రతీ ఒక్కరూ మొక్కలు చేత్తో పట్టుకొని, మొక్కలు నాట వలసిన అవశ్యకత ను slogans ద్వారా పుర ప్రజలకు తెలియచేసిరి. భవిష్యత్తులో నీటి యుద్ధాలు జరగకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటమనీ కమిషనర్ శ్రీ కనకారావు గారు అన్నారు. భరత భూమిని రక్షించేందుకు ప్రతీ ఒక్కరూ మొక్కలు పెంచాలని శ్రీ Marreddy Srinivas అన్నారు.







